వట్టుపల్లి దర్గాలో గాలి అనిల్ కుమార్ ప్రార్థనలు

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గం వట్టుపల్లి దర్గాను జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో కలిసి దర్శించుకున్నారు.

Update: 2024-04-30 12:57 GMT

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గం వట్టుపల్లి దర్గాను జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గాను దర్శించుకుని చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా

     ఆయన మంగళవారం ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి తనకు ఓటేసి పార్లమెంటు కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఆందోల్ ఇంచార్జ్ మాణిక్యం, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Similar News