మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో..బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్…

మాజీ సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Update: 2024-04-27 11:43 GMT

దిశ, కొండపాక: మాజీ సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి తో పాటు కొండపాక ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు చింతల సాయి బాబా గౌడ్, ఎంపిటిసి పత్తి ఆంజనేయులు, కుకునూర్ పల్లి మాజీ సర్పంచ్ పోల్కంపల్లి జయంతి భర్త పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పోల్కంపల్లి నరేందర్, మాజీ ఎంపిటిసి లు ఇండ్ల కనకయ్య , విశ్వబ్రాహ్మణ సంఘం ఉమ్మడి కొండపాక అధ్యక్షులు పుల్లోజు సుదర్శన్ చారి, శివలింగు శ్రీనివాస్ తదితరులుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్స రెడ్డి, మెదక్ డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి ,కొండపాక , కుకునూర్ పల్లి మండలల పార్టీ అధ్యక్షులు వాసరి లింగరావు , విరుపాక శ్రీనివాస్ రెడ్డి , పిఎసిఎస్ డైరెక్టర్ లు బూర్గుల సురేందర్ రావు, సిర్వోజి నరసింహ చారి, మాజీ సర్పంచ్ బోడపట్ల ఐలం శివ, రెడ్డమైన రవీందర్, రెడ్డమైన రవి, కనక రాములు తదితరులు పాల్గొన్నారు.

Similar News