వైభవంగా బేతాళ స్వామి జాతర
ఝరాసంగం మండలంలోని కంభాలపల్లి గ్రామ శివారులో వెలిసిన భూత, ప్రేత, పిశాచ గణాలకు అధిపతిగా పిలువబడే బేతాళ స్వామి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
దిశ, ఝరాసంగం : ఝరాసంగం మండలంలోని కంభాలపల్లి గ్రామ శివారులో వెలిసిన భూత, ప్రేత, పిశాచ గణాలకు అధిపతిగా పిలువబడే బేతాళ స్వామి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గ్రామస్తులు, మహిళలు స్వామివారికి భక్తిశ్రద్ధలతో బోనాల నైవే ద్యం సమర్పించారు. భాజాభజంతులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తున పూనకాల మధ్య కొనసాగిన బోనాల ఉత్సవాలు పలువుని ఆకర్షించాయి. బోనాలు వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు భారీగా తరలివచ్చారు.