అప్పులు తీర్చలేక యువకుడు ఆత్మహత్య

చేసిన అప్పులు తీర్చే దారి లేకపోవడంతో మనస్థాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాసాయిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Update: 2023-02-03 14:29 GMT

దిశ, చేగుంట : చేసిన అప్పులు తీర్చే దారి లేకపోవడంతో మనస్థాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాసాయిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన చిన్నారాం నవీన్ కుమార్ (28) మాసాయిపేట గ్రామానికి చెందిన అరుణను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులతో పాటు చిట్టి ల కోసం వేసిన డబ్బులను చెల్లించలేక మనస్థాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నవీన్ కుమార్ భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Similar News