మంచి నీళ్ల కోసం రాస్తారోకో

జిల్లా కేంద్రంలోని 16 వ వార్డు బోయపల్లి లో గత 10 రోజులుగా

Update: 2024-05-01 09:40 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని 16 వ వార్డు బోయపల్లి లో గత 10 రోజులుగా మిషన్ భగీరథ మంచినీరు రావడం లేదని బుధవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో వార్డు ప్రజలు ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.గంటపాటు రోడ్డుపై ధర్నా చేపట్టి నినాదాలు చేశారు.ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోయాయి.గత రెండు,మూడు రోజులుగా తాము స్నానాలు చేయలేదని,కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలని,అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు.అసలే భగ్గుమంటున్న ఎండలు,నోరు పిడుచకట్టుకపోయి తాగుదామంటే గ్రామంలో గుక్కెడు మంచి నీరు దొరకడం లేదని గ్రామస్తులు ఆరోపించారు.విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను సముదాయించారు.వెంటనే మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు.

Similar News