ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకం.. వైద్యం వికటించి వ్యక్తి మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్ఎంపీల చేష్టలు రోజురోజుకు

Update: 2024-05-06 08:58 GMT

దిశ,నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్ఎంపీల చేష్టలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి.ఓ ఆర్ఎంపీ వైద్యుడు నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన తెలకపల్లి మండలం కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన మాడెం చిన్న రాములు (38) తెలకపల్లి మండల కేంద్రంలోని సాయి క్లినిక్ ఆర్ఎంపీ వైద్యుని దగ్గర సోమవారం ఉదయం చికిత్స నిమిత్తం వెళ్ళాడు. రాములను పరీక్షించిన ఆర్ఎంపీ వైద్యుడు టైఫాయిడ్ ఉందని ఇంజక్షన్ఇచ్చాడు. మరి కొద్దీ సేపటికి సెలైన్ బాటిల్ ఎక్కించారు.ఆ వైద్యం వికటించింది. వెంటనే కొల్లాపూర్ చౌరస్తాలోని గాయత్రి ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని సూచించాడు. మార్గం మధ్యలోనే రాములు చనిపోవడంతో ఆర్ఎంపీ వైద్యుడు పరారయ్యాడు. మృతుడి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎలాంటి వైద్యం లేకుండా చికిత్స నిర్వహించిన ఆర్ఎంపీ వైద్యుని పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News