లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. ముగ్గురు పరిస్థితి విషమం
సోమవారం బండరుపల్లి గ్రామ సమీపంలో సమీపంలో చోటు చేసుకుంది.
దిశ,దేవరకద: సోమవారం బండరుపల్లి గ్రామ సమీపంలో సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే చిన్నచింతకుంట మండలం బండరుపల్లి గ్రామ సమీపంలో సోమవారం షాద్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆత్మకూరు నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా రాయచూరు వైపు వెళ్లే లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గాయపడినవారిని అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి పంపించారు.
సీసీ కుంట పోలీసులు రావడానికి సమయం పట్టడంతో అంతర్జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనితో బండరుపల్లి గ్రామ సర్పంచ్ సతీష్ , యువకులు సంఘటన స్థలానికి చేరుకొని జెసిబి సహాయంతో ఆ రెండు వాహనాలను పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారితో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. పది మంది స్వల్పంగా గాయపడ్డారు.