మూడోసారి మోదిని ప్రధాని చేసి దేశాన్ని కాపాడుకుందాం : భరత్ ప్రసాద్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ విజయ

Update: 2024-05-01 16:33 GMT

దిశ,పెబ్బేరు: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ విజయ సంకల్ప యాత్ర లో భాగంగా పెబ్బేరు మున్సిపాలిటీ లో కర్రెమ్మ గుడి నుండి ప్రధాన దారులలో బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు మండలం లోని గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. పెబ్బేరు సుభాష్ చౌరస్తాలో ఈ సందర్బంగా భరత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తు ఓటు వేసి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేసి దేశాన్ని కాపాడుకుందాం అన్నారు.

నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశానికి ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. భవిష్యత్ తరాలు అభివృద్ధి, పేద కుటుంబాలకు అండగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కూడా ఖాయం అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, సబి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హేమా రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Similar News