తనిఖీలలో భారీ నగదు స్వాధీనం..

కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చెగుంట చెక్ పోస్ట్ వద్ద

Update: 2024-05-07 13:55 GMT

దిశ, మక్తల్: కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చెగుంట చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రూ. 16 లక్షల 47 వేల ఒక వంద నగదు పట్టుబడింది. కర్ణాటకలోని యాదగిరి జిల్లా వాడి పట్టణంలో వ్యాపారం నిర్వహించుకుని రాయచూరు జిల్లా మాన్వి పట్టణానికి కారులో వెళుతున్న మహమ్మద్ హుస్సేన్ వాహనాన్ని ఎక్సైజ్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, ఎఫ్ఎస్ఠిటి టీం వాహనాల తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన డబ్బుకు ఎలాంటి రసీదు లేనందున వాటిని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగిందని కృష్ణ ఎస్సై ఎండి నవీద్ తెలిపారు.ఎవరైనా 50 వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బులతో ప్రయాణిస్తే తగిన పత్రాలు కలిగి ఉండాలన్నారు.

Similar News