దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: బీజేపీపై కూనంనేని ఫైర్

Update: 2023-03-20 09:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మండిపడ్డారు. 9 ఏళ్లలో దేశంలో ఒక్క బీజేపీ నేతపై కూడా సీబీఐ, ఈడీ కేసులు, దాడులు లేవని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేత మనీష్ సిసోడియా బీజేపీకి లొంగిపోతే ఈ కేసులుండవని కీలక వ్యాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News