‘‘రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్.. బెదిరించి దోచుకోవడమే అతని పని’’

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2023-04-22 11:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్.. బెదిరించి దోచుకోవడమే అతని పని తీవ్ర ఆరోపణలు చేశారు. భాగ్యలక్ష్మీ ఆలయంలో రేవంత్ రెడ్డి అడుగుపెడితే ఆ గుడి అపవిత్రమవుతోందని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సీక్రెట్ డీల్ నిజమేనని.. బీఆర్ఎస్ ఇచ్చిన రూ.25 కోట్లలో 15 కోట్లు రేవంత్ నొక్కేశాడని ఆరోపణలు చేశారు.

కేసీఆర్ కూతురు కవితతో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపారాలు చేయడంలేదా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కవితతో వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉందో లేదో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. తనపై రేవంత్ చేసిన ఆరోపణలు నిరూపించాలని.. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 

Tags:    

Similar News