కాంగ్రెస్లో చేరిక వేళ KCR కుటుంబంపై కేకే సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్లో చేరిక వేళ కేసీఆర్ కుటుంబంపై కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్లో చేరిక వేళ కేసీఆర్ కుటుంబంపై కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గురించి టీఆర్ఎస్కు ముందే కాంగ్రెస్ ఆలోచించిందన్నారు. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అంశాన్ని ముందే ఆలోచించిందన్నారు. బాగారెడ్డి చైర్మన్గా సీఎఫ్టీ ఏర్పాటు జరిగిందన్నారు. రాజీనామా చేస్తామని 42 మంది ఎమ్మెల్యేలు ఆనాడే సోనియాకు లేఖ రాశారన్నారు. తెలంగాణ కోసం చాలా మంది నాయకులు నిరాహార దీక్షలు చేశారన్నారు. అందరికంటే ముందు కృష్ణా రావు రాజీనామా చేశారని గుర్తు చేశారు. 1998 నుంచి తెలంగాణ పోరాటం మొదలైందన్నారు. ఆరు వర్కింగ్ కమిటీలు ఏర్పాటు అయ్యాయన్నారు. వార్ గ్రూపులో తాను సభ్యుడిగా పనిచేశానన్నారు. బీఆర్ఎస్ను కుటుంబమే నడిపిస్తుందనే భావన ప్రజల్లో ఉందని పరోక్షంగా కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చేసినా క్యాడర్ను దూరం చేసుకోకూడదన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని మరిచిపోలేనన్నారు. కొన్ని సరిచేసుకోవాల్సిన అంశాలను బీఆర్ఎస్ సరిచేసుకోలేదన్నారు.