తమ్మినేని క్రిష్ణయ్య హత్య కేసులో దర్యాప్తుపై పలు అనుమానాలు ఉన్నాయ్: బీజేపీ
దిశ, ఖమ్మం రూరల్ : తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో దర్యాప్తు సరిగా లేదని, పలు అనుమానాలు ఉన్నాయ్ అని బీజేపీ లీగల్ సెల్..
దిశ, ఖమ్మం రూరల్ : తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో దర్యాప్తు సరిగా లేదని, పలు అనుమానాలు ఉన్నాయ్ అని బీజేపీ లీగల్ సెల్ కమిటీ కన్వీనర్ అంటొని రెడ్డి అన్నారు. శనివారం రూరల్ మండలం గత నెల 15న హత్య చేయబడిన టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని క్రిష్ణయ్య కుటుంబాన్ని బీజేపీ స్టేట్ లీగల్ టీమ్ సభ్యలు పరామర్శించి క్రిష్ణయ్యకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లొంగిపోయిన నిందితులను కస్టడీలోకి కూడా తీసుకోలేదని ప్రశ్నించారు.
కృష్ణయ్య కుటుంబం స్వతంత్ర సంస్థకు ఈ కేసును ఇవ్వమని కోరుతుందని తప్పకుండా సీబీఐ ఎంక్వైయిరీ కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తామని, అవసమైతే సెంట్రల్ హోం మంత్రిత్వశాఖకు కూడా విషయాన్ని తెలిపి వారి కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. తమ టీమ్ కూడా తప్పకుండా సీబీఐ ఎంక్వైరీ కోరుతుందన్నారు. నిజాలు నిగ్గు తేలే వరకు తాము ఈ కేసుపై దృష్టి సారిస్తాం అని తెలిపారు.
తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఈ కేసుపై నివేదిక ఇస్తామని తెలిపారు. వచ్చే నెల 10 వరకు కోర్టుకు సెలవులు ఉన్నాయని, కాబట్టి ఆ తరువాత పిటిషన్ వేస్తామని అన్నారు. ఈ మర్డర్లో పెద్ద పెద్ద పొలిటికల్ నాయకుల ప్రమేయం ఉండటం వల్ల ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యానారయణ, శ్రీనివాస్గౌడ్, శ్రీకాంత్ గౌడ్, డీ. శ్రీనివాసరావు, గడ్డం గణేష్, కటకం శారవ, కృష్ణ, అనన్య, వనం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.