సాగర్ కాలువలో పడి వ్యక్తి గల్లంతు
సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి గల్లంతైన సంఘటన రూరల్ మండలంలో జరిగింది.
దిశ, ఖమ్మం రూరల్ : సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి గల్లంతైన సంఘటన రూరల్ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన నాను అనే వ్యక్తి శుక్రవారం అనారోగ్యంతో మరణించడంతో ఖర్మకాండల కోసమని శనివారం భూక్యా మంగ్య (45) సమీప బంధువులతో కలిసి సాగర్ కాలువలో స్నానం చేయడం కోసం వెళ్లడంతో ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో గల్లంతయ్యాడు. కళ్లముందు గల్లంతవుతున్న మంగ్యను రక్షించేందుకు ప్రయత్నం చేసినా సాగర్ నీటి ప్రవాహాం అధికంగా ఉండడంతో ప్రయత్నం ఫలించలేదు. దాంతో మంగ్య నీటిలో కొట్టుకుపోయాడు.