రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మండలంలోని పెగళ్లపాడు రైల్వే వంతెన సమీపంలో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2023-03-30 13:56 GMT

దిశ, ఎర్రుపాలెం: మండలంలోని పెగళ్లపాడు రైల్వే వంతెన సమీపంలో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం మీనవోలు గ్రామానికి చెందిన కుడుముల వెంకటరెడ్డి(33) అనే వ్యక్తి మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న షిరిడి స్పెషల్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. మృతునికి భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు. రైల్వే పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అన్నం ఫౌండేషన్ సిబ్బంది సహకారంతో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News