అసలేమీ జరుగుతుంది ఎర్ర బోడులో..?
మొన్నటివరకు ప్రపంచానికి తెలియని ఎర్రబోడు ఇవాళ రాష్ట్రంలో సంచలనలకు కేంద్ర బిందువు అవుతుంది...Latest News about Errabodu
దిశ, చండ్రుగొండ: మొన్నటివరకు ప్రపంచానికి తెలియని ఎర్రబోడు ఇవాళ రాష్ట్రంలో సంచలనలకు కేంద్ర బిందువు అవుతుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అటవీ శాఖ అధికారి చలమల శ్రీనివాసరావు హత్య ఘటన అనేక మలుపులు తిరుగుతుంది. ఈ ఘటనకు కారకులైన వలస ఆదివాసీలైన(గోత్తి కోయలు) పై బెండలపాడు గ్రామపంచాయతీ పాలకవర్గం చేసిన బహిష్కరణ తీర్మానంపై ఇప్పటికే కొన్ని ఆదివాసీ సంఘాలు, టీజేఎస్ ప్రొఫెసర్ కోదండరాం ఎర్రబోడు గ్రామాన్ని సందర్శించి బహిష్కరణ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న నాలుగు వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, సీపీఎంఎల్, న్యూ డెమోక్రసీ, ప్రజాపంథా పార్టీలకు చెందిన జిల్లా కార్యదర్శులు, అదేవిధంగా అడ్వకేట్స్, జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకోవాలని ఘటన స్థలానికి వెళ్తున్నారు.
Also Read....
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు