సీపీఐ సీనియర్ నేత పువ్వాడకు తమ్మినేని పరామర్శ

ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సీపీఐ జాతీయ నాయకులు,

Update: 2023-04-26 05:57 GMT

దిశ బ్యూరో, ఖమ్మం: ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావును బుధవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం నేత పోతినేని సుదర్శన్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు. తిరిగి పువ్వాడ ఆరోగ్యం కుదుట పడటం తమ్మినేని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ప్రస్తుత రాష్ట్ర, జిల్లా రాజకీయ పరిణామాలు వామపక్షాల ఐక్యత, ఇతర రాజకీయ అంశాలపై పువ్వాడతో సీపీఎం నేతలు చర్చించారు. పువ్వాడతో ఆయన తనయుడు మంత్రి అజయ్ కుమార్ ఉన్నారు.

Tags:    

Similar News