మూక మామిడి ప్రాజెక్టులో శవం

మూక మామిడి ప్రాజెక్టు నీళ్లలో మృతదేహం కలకలం రేపింది. గురువారం ఉదయం శవాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Update: 2023-05-18 06:14 GMT

దిశ, ములకలపల్లి: మూక మామిడి ప్రాజెక్టు నీళ్లలో మృతదేహం కలకలం రేపింది. గురువారం ఉదయం శవాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం చేపల కోసం ప్రాజెక్టులో దిగిన మూక మామిడి గ్రామానికి చెందిన వాంకుడోత్ కృష్ణ (56) గా స్థానికులు గుర్తించారు. కృష్ణ బుధవారం నుంచి కనిపించకపోవడంతో ప్రాజెక్టు పరిసరాల్లో గ్రామస్తులు వెతికారు. ఆయన ధరించిన బట్టలు ప్రాజెక్టు కట్టపై ఉండటంతో కృష్ణ ప్రాజెక్టులో మునిగిపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతునికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య తాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News