MP ఉత్తమ్‌కు కాంగ్రెస్ కీలక బాధ్యతలు.. రెండు రాష్ట్రాల్లో ఆయనే!

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను సమన్వయం చేసే బాధ్యత తనకు అప్పగించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి

Update: 2022-09-20 09:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను సమన్వయం చేసే బాధ్యత తనకు అప్పగించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. రాహుల్ గాంధీ యాత్రను రెండు రాష్ట్రాల్లో తానే పర్యవేక్షిస్తానన్నారు. ఇవాళ విజయవాడకు వెళ్లిన ఉత్తమ్ ఇదే విషయం గురించి మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాన్ని చెప్పారు. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోందని ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్తోందన్నారు. ఏపీలో కూడా ఈ యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా కలిసి రావాలని సూచించారు. చిన్న చిన్న అభ్యంతరాలుంటే అన్ని సర్దుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. యాత్ర విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఉత్తమ్ సూచించారు. ఈనెల 7వ తేదీన మొదలైన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 200 కి.మీ పూర్తి చేసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News