BREAKING: దిశా ఎన్ కౌంటర్ కేసులో బిగ్ ట్విస్ట్

తెలంగాణలో సంచలనం రేపిన దిశా ఎన్ కౌంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై

Update: 2024-05-01 10:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం రేపిన దిశా ఎన్ కౌంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ హై కోర్టు స్టే విధించింది. కాగా, దిశా ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం సిర్పూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేసిన సిర్పూర్కర్ కమిషన్ దిశా ఎన్ కౌంటర్ బూటకమంటూ నివేదికను సమర్పించింది. సిర్పూర్కర్ కమిటీ ఇచ్చిన నివేదికపై పలువురు అధికారులు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. తాజాగా సిర్పూర్కర్ కమిటీ నివేదికపై స్టే విధించింది. ఇక, దిశ అనే యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేసి హత్యా చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోని నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 

Similar News