కాకతీయ కెనాల్ బ్రిడ్జిపై మరమ్మతు పనులు షురూ.. : దిశ ఎఫెక్ట్

మండలంలోని పచ్చునూర్, పోచంపల్లి మధ్య కాకతీయ కెనాల్ బ్రిడ్జిపై పొంచి ఉన్న గురించి దిశ, డిజిటల్ మీడియాలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.

Update: 2023-06-04 13:25 GMT

దిశ, మానకొండూర్ : మండలంలోని పచ్చునూర్, పోచంపల్లి మధ్య కాకతీయ కెనాల్ బ్రిడ్జిపై పొంచి ఉన్న గురించి దిశ, డిజిటల్ మీడియాలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఆదివారం కేనాల్ బ్రిడ్జిపై గుంతలను మట్టితో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పచ్చునూర్, పోచంపల్లి శివారులో గల కెనాల్ బ్రిడ్జి శిధిలావస్థలో ఉంది. అయినప్పటికీ ఇసుక ఓవర్ లోడ్ లారీలు ఇదే బ్రిడ్జిపై నుంచి అదుపు తప్పి ఇసుక లోడ్ తో కెనాల్లో పడిపోయాయి. దిశ కథనానికి స్పందించి కెనాల్ బ్రిడ్జిపై ప్రమాదకరమైన గుంతలను పచునూర్ సర్పంచ్ అధ్వర్యంలో గుంతలు పుడ్చారు. కానీ బ్రిడ్జి మాత్రం ఎప్పుడు కూలిపోతుందేమోనని ప్రయాణికులు జంకుతున్నారు.  

Tags:    

Similar News