అర్ధరాత్రి చిరుత దాడి.. లేగదూడ మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లె గ్రామానికి చెందిన.... Leopard migration

Update: 2023-02-12 05:48 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లె గ్రామానికి చెందిన మునిగే ఎల్లయ్య ఇంటిలో కట్టేసిన లేగ దూడపై చిరుత శనివారం రాత్రి దాడి చేసి చంపేసింది. చిరుత సంచరించిన పాదముద్రలు గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత మళ్లీ ఎప్పుడు ఊర్లోకి వస్తుందని భయం భయంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News