Bandi Sanjay: రేపు సిరిసిల్లకు బండి సంజయ్ రాక

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Update: 2022-12-21 14:23 GMT

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు (గురువారం) సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారు. స్థానిక పాత బస్టాండ్ (రగుడు) వద్దనున్న గాంధీ లహరి ఫంక్షన్ హాలులో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. పోలింగ్ బూత్ కమిటీల నిర్మాణం, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై పార్టీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలపై చర్చించడంతోపాటు సెస్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం వేములవాడ బయలుదేరుతారు. బండి సంజయ్ రాకను పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం 2 గంటలకు తిప్పాపూర్ నుండి భీమేశ్వర గార్డెన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం భీమేశ్వర గార్డెన్ లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై సంస్థాగత బలోపేతంతోపాటు సెస్ ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నట్లు బీజేపి నేతలు పేర్కొన్నారు.

Tags:    

Similar News