రాష్ట్ర బడ్జెట్పై కామినేని సీఈవో రియాక్షన్ ఇదే
ప్రభుత్వం హెల్త్ కేర్ రంగాన్ని పటిష్టం చేసేందుకు ఆసక్తిగా ఉన్నదని బడ్జెట్ను చూస్తే అర్థం అవుతున్నదని కామినేని ఆసుపత్రి సీఈవో గాయత్రి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం హెల్త్ కేర్ రంగాన్ని పటిష్టం చేసేందుకు ఆసక్తిగా ఉన్నదని బడ్జెట్ను చూస్తే అర్థం అవుతున్నదని కామినేని ఆసుపత్రి సీఈవో గాయత్రి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,161 కోట్లుకేటాయించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యరంగం పటిష్టం కావడమే కాకుండా అన్ని రకాల ఆసుపత్రులు వృద్ధి చెందే ఛాన్స్ఉన్నదన్నారు. గడిచిన ఏడాదితో పోల్చితే 8 శాతం అదనంగా నిధులు సమకూర్చారన్నారు. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం వలన గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు బలోపేతం అవుతాయన్నారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడంలో కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులను సులువుగా చేసేందుకు వెలుసుబాటు ఉంటుందన్నారు. వైద్యరంగంలో పరిశోధన పెరుగుతుందన్నారు. ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ నిధులు కేటాయించినందుకు మంత్రి హరీష్రావుకు థాంక్స్ తెలుపుతున్నానని చెప్పారు.