అమరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తా: KA పాల్ కీలక హామీ

కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో నేడు అమరవీరుల ఆత్మ ఘోషిస్తుందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2023-06-02 15:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో నేడు అమరవీరుల ఆత్మ ఘోషిస్తుందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగలేదని, అప్పుల, దరిద్ర, కన్నీరు తెలంగాణ అయిపోయిందని తెలిపారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాగానే 1538 పైగా ఉన్న అమర వీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.

లేదా కేసీఆర్ ఇప్పుడే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరుల త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చిందని, కానీ నేడు వారి కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగుల సమస్య పెరిగిందన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా అభివృద్ధి జరగలేదని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాలనలో కూడా రాష్ట్రాలను అప్పుల పలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బానిసలు అవ్వకుండా ప్రజాశాంతి పార్టీలో చేరి కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News