మోదీ పాలనలో దేశం ప్రగతి పథంలో నడుస్తుంది : మాజీ ఎమ్మెల్యే

మోదీ పాలనలోనే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ అన్నారు. మరోసారి మోదీ ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షింస్తున్నారని చెప్పారు.

Update: 2024-04-28 15:06 GMT

దిశ, అంబర్ పేట: మోదీ పాలనలోనే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ అన్నారు. మరోసారి మోదీ ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షింస్తున్నారని చెప్పారు. అంబర్ పేట నియోజకవర్గంలోని హోటల్ ధ్రువ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, మాజీ మంత్రివర్యులు బీజేపీ సీనియర్ నాయకులు సి.కృష్ణ యాదవ్, కార్పొరేటర్ అమృత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా జి.కిషన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి తెచ్చిన నిధులు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చేసిన సేవ, అభివృద్ధి కార్యక్రమాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, మేధావులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరికీ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిగా అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్ యాదవ్, కన్వీనర్ శ్యామ్ రాజు తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Similar News