నాంపల్లి నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి నియోజకవర్గంలో సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రచారం నిర్వహించారు.

Update: 2024-04-26 08:59 GMT

దిశ,కార్వాన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి నియోజకవర్గంలో సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రచారం నిర్వహించారు. మల్లేపల్లి ,ఆసిఫ్ నగర్ డివిజన్ల లోని పలు బస్తీలలో పర్యటించారు. ప్రజలు దారిపొడవునా నీరాజనం తెలుపగా, బస్తీల్లో మహిళలు అడుగడుగునా మంగళ హారతులతో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు, తరలివచ్చి జై జై లు కొడుతూ వాహనాల పై ప్రచారంలో పాల్గొన్నారు. మరో వైపు చిన్నారులు సైతం కిషన్ రెడ్డి పై పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ చంద్ర,పవన్ కుమార్, బుజెందర్, మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Similar News