జనగామ మున్సిపాలిటీలో హైటెన్షన్! అవిశ్వాసంపై కలెక్టర్కు లేఖ
జనగామ మున్సిపాలిటీలో క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: జనగామ మున్సిపాలిటీలో క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, ఫోర్ లీడర్ల తీరుపై ఆగ్రహంతో ఉన్న 11 మంది కౌన్సిలర్లు ఈ నెల 25న క్యాంపు రాజకీయాలకు తెరలేపిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అసంతృప్తి కౌన్సిలర్లతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు చర్చలు జరిపారు.
కాగా తాజాగా చర్చలు విఫలం కావడంతో హైటెన్షన్ నెలకొంది. దీంతో అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నేడు ప్రతి పక్ష కౌన్సిలర్ల మద్దతును అసమ్మతి కౌన్సిలర్లు కోరనున్నట్లు తెలిసింది. అవిశ్వాసంపై కలెక్టర్కు లేఖ ఇచ్చేందుకు అసమ్మతి కౌన్సిలర్లు సన్నాహాలు మొదలు పెట్టడంతో జనగామ మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.