విధి నిర్వహణలో నిర్లక్ష్యం..హెడ్ మాస్టర్ సస్పెండ్

ఉమ్మడి జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు.

Update: 2024-03-29 04:18 GMT

దిశ,వెబ్ డెస్క్:ఉమ్మడి జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు.విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి విధులకు గైర్హాజరైన గన్నేరువరం మండలం హనుమాజి పల్లి ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ భాగ్యలక్ష్మిని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్ రావు సస్పెండ్ చేశారు.విధులకు ఆలస్యంగా హాజరైన మరో ఇద్దరు ఉపాధ్యాయుల పై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ముందస్తు అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హాజరైన సిబ్బంది వివరాలు తమ దృష్టికి తీసుకుని వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News