RTC విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం

ఆర్టీసీ విలీనం బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపింది. దాదాపు నెల రోజుల తర్వాత ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై గురువారం ఆమోద ముద్ర వేసింది.

Update: 2023-09-14 06:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్ ఆర్టీసీ కార్మికుల కొన్ని ఏళ్ళ కల ఫలించింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు నెల రోజుల త‌ర్వాత గ‌వ‌ర్నర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విష‌యంలో ప్రభుత్వ స్పంద‌న‌పై సంతృప్తి చెందిన‌ట్లు గ‌వ‌ర్నర్ తమిళపై పేర్కొన్నారు. న్యాయ శాఖ పరిశీలన తర్వాత.. బిల్లులోని అంశాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు గ‌వ‌ర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News