బీజేపీ, టీఆర్ఎస్లు హైదరాబాద్కు ఏం చేశాయి..? మాజీ ఎంపీ పొన్నం
సెప్టెంబర్ 17ను బీజేపీ, టీఆర్ఎస్లు రాజకీయం చేశాయని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సెప్టెంబర్ 17ను బీజేపీ, టీఆర్ఎస్లు రాజకీయం చేశాయని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గత 8 సంవంత్సరాలు బీజేపీ, టీఆర్ఎస్లు ఒకరికొకరు సహాకరించుకున్న విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. సెప్టెంబర్ 17 గురించి మాట్లాడుతున్న బీజేపీ, టీఆర్ఎస్లు అసలు హైదరాబాద్కు ఏం చేసాయో చెప్పాలని పొన్నం ప్రశ్నించారు. 2012లో కొన్ని రాష్ర్టాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం ఏర్పాటు చేసిందని.. కానీ, హైదరాబాద్ ప్రాంతానికి మాత్రం నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు బండి సంజయ్ చేసేది పాదయాత్ర కాదు విహారయాత్ర అని, కేసీఆర్ది సహాకారయాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాం అన్నారు. విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలి. హైదరాబాద్ను ప్రత్యేక ఎకనామిక్ జోన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, హైదరాబాద్ టూ ఢిల్లీ బుల్లెట్ ట్రైన్ వేయాలని అన్నారు. కాగా, డబుల్ ఇంజన్ ఉన్న రాష్ట్రాలలో పాలన తిరోగమనంలో ఉందని ప్రభాకర్ సెటైర్లు వేశారు.