కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు కాషాయతీర్థం పుచ్చుకున్నారు.

Update: 2023-04-07 07:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త జూటుర్ కీర్తిరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని ర్యాలీగా ఆమె పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆపై కిషన్ రెడ్డి, పలువురు నేతల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆమెతో పాటు మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ సుభాషిన్ రెడ్డి తనయుడు ఇంద్రసేనారెడ్డి సైతం కాషాయతీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా ఉద్యమకారుడు, టీజేఎస్ నేత గంగపురం వెంకట్ రెడ్డి సైతం బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం విజయ్ కుమార్ సైతం పార్టీలో చేరారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News