ముగిసిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈడీ విచారణ.. 10 గంటల పాటు ప్రశ్నల వర్షం

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండవ రోజు ఈడీ విచారణ ముగిసింది.

Update: 2022-09-28 15:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండవ రోజు ఈడీ విచారణ ముగిసింది. మొదటి రోజు 9 గంటలకు పైగా ప్రశ్నించిన ఈడీ.. రెండవ రోజు ఏకంగా 10 గంటల పాటు ఎమ్మెల్యేపై ప్రశ్నలు వర్షం కురిపించింది. విదేశాల్లో పెట్టుబడులు, ఫెమా నిబంధనల ఉల్లఘంనలపై విచారించింది. ఎమ్మెల్యే మంచి కిషన్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. విచారణలో భాగంగా విదేశీ టూర్లపై కిషన్ రెడ్డి ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు. 

Similar News