విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ అంశంలో బీఆర్ఎస్‌కు సీపీఐ సపోర్ట్

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.

Update: 2023-04-10 09:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని మోడీ అంటున్నారని, ఆయన అబ్బసొత్తు ఇచ్చారా అని ఫైర్ అయ్యారు. గంగమ్మ జాతరకు బలిచ్చే ముందు మేకను పోషించినట్లు రైల్వేని ఆధునీకరించి అమ్మేస్తారన్నారు. బీఎస్ఎన్ఎల్ నిలబెట్టడానికి రూ.30వేల కోట్లు ఇస్తే సరిపోయేదని, కానీ ప్రైవేటు కంపెనీకి రూ.30వేల కోట్లు ఇచ్చి బీఎస్ఎన్ ఎల్ ని దెబ్బతీశారన్నారు.

డిగ్రీ విషయంలో ప్రధాని మోడీ అబద్ధాలు చెప్పడం ఆయన అనైతికతకు నిదర్శనమన్నారు. మోడీ ఊపిరి అదానీ చేతిలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సర్కారు కొనుగోలు చేయాలన్నారు. సీపీఐ తరపున పూర్తి మద్దతు ఇస్తామన్నారు. 

ఇవి కూడా చదవండి:   ‘నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే దమ్ము లేదు.. విశాఖ స్టీల్‌కు టెండర్లు వేస్తారా’

Tags:    

Similar News