పరస్పర ఫిర్యాదులు.. దుండిగల్ పీఎస్కు బదిలీ
పరస్పర ఫిర్యాదుల కేసును పోలీసులు బదిలీ చేశారు.
దిశ.దుండిగల్: పరస్పర ఫిర్యాదుల కేసును పోలీసులు బదిలీ చేశారు. ఐటీ డిప్యూటీ కమిషనర్ రత్నాకర్, ఐటీ అధికారులు తమపై బలవంతంగా నేరాలు మోపుతున్నారని మంత్రి మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్ పల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారులు సైతం తమ అధికారి రత్నాకర్ను మంత్రి మాల్లారెడ్డి నిర్బంధించి ల్యాప్టాప్,సెల్ఫోన్ లాక్కున్నారని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కాగా ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి సూరారం మాల్లారెడ్డి ఆసుపత్రిలో ఈ ఘటన జరగడంతో బోయినపల్లి పోలీసులు కేసును దుండిగల్ పోలీస్స్టేషన్కు గురువారం రాత్రి ఆన్లైన్లో బదిలీ చేసినట్లు తెలిసింది. కేసును స్వీకరించిన దుండిగల్ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. దుండిగల్ సీఐ పీ.రమణారెడ్డిని ఇదే విషయమై వివరణ కోరగా పరస్పర కేసు బోయినపల్లి పోలీస్ స్టేషన్ నుంచి దుండిగల్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యిందని తెలిపారు. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.