నేడు కంటోన్మెంట్, చేవెళ్లలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

నేడు సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల లోక్‌సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

Update: 2024-04-25 02:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల లోక్‌సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు గాంధీభవన్ లో బీజేపీపై ఛార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. సాయంత్రం 5గంటలకు రాజేంద్ర నగర్ ( చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం)లో రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రోడ్ షో లో సీఎం పాల్గొననున్నారు. 

Similar News