రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టాన పెద్దలతో భేటీ

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రేపు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు.

Update: 2024-03-12 16:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రేపు సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగే పార్టీ సీఈసీ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో ఇప్పిటకే 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అదేవిధంగా మిగతా స్థానాలకు అభ్యర్థులపై రేపు ఢిల్లీలోకి కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ భేటీ కానున్నారు. ఆయన వెంట ఒకరిద్దరు మంత్రులు వెళ్లే అవకాశం ఉంది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, రఘువీర్ కుందూరు, మహబూబా బాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఇప్పటికే ప్రకటించారు. మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ పాలమూరు బహిరంగ సభలో వెల్లడించారు. 

Tags:    

Similar News