నేడు కరీంనగర్కు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ సోమవారం కరీంనగర్లో పర్యటించనున్నారు.
దిశ, కరీంనగర్: సీఎం కేసీఆర్ నేడు(సోమవారం) కరీంనగర్లో పర్యటించనున్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య దశ దినకర్మ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం మంత్రి గంగుల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. సోమవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ చేరుకుంటారని సమాచారం. కాగా మంత్రి గంగుల తండ్రి మల్లయ్య(87) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.