బ్రేకింగ్ : మండలి, శాసనసభ సమావేశాల నోటిఫికేషన్ జారీ

మండలి, శాసనసభ సమావేశాల నోటిఫికేషన్ మంగళవారం జారీ అయింది.

Update: 2023-01-31 09:04 GMT

దిశ, వెబ్ డెస్క్: మండలి, శాసనసభ సమావేశాల నోటిఫికేషన్ మంగళవారం జారీ అయింది. వచ్చే నెల 3 నుంచి ఉభయ సభల సమావేశాలు జరగనున్నాయి. 3న మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ కౌన్సిల్ ఉమ్మడి సమావేశం జరగనుంది. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉభయ సభలను ప్రోరోగ్ చేయకుండానే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కొనసాగింపు సమావేశాల్లోనే గవర్నర్ ప్రసంగించనున్నారు.

Tags:    

Similar News