TS: ఇంటర్‌లో ఫెయిల్.. మనస్థాపంతో విద్యార్థి సూసైడ్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో విషాదం చోటు చేసుకుంది.

Update: 2023-05-09 08:53 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ లో ఫెయిల్ అయ్యానని మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు ప్రకటించిన కొద్దీ సేపటికే ప్రజ్వల్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్‌కు చెందిన ప్రజ్వల్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. హైదరాబాద్ మాదాపూర్‌లో కార్పొరేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. జూనియర్ ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News