కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీ‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ

పార్లమెంట్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

Update: 2024-04-29 11:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత సోమవారం బీజేపీలో చేరారు. బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక, హస్తం పార్టీ నుంచి ఆయన పెద్దపల్లి టికెట్ ఆశించగా.. కాంగ్రెస్ మాత్రం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించింది.

Similar News