బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఇద్దరు కీలక నేతలు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది.
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పలు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ మంత్రి రాజేశ్వర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సముద్రాల వేణుగోపాల్ చారి బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి చైర్మన్గా పని చేశారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆదిలాబాదు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ నాయకుడు ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు.