BJP అధికారంలోకి రాగానే భైంసా పేరు మారుస్తాం: బండి కీలక వ్యాఖ్యలు

భైంసా సమీపంలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీ- బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-11-29 12:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: భైంసా సమీపంలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీ- బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భైంసా పేరును మహిషాగా మారుస్తామన్నారు. అంతేకాకుండా భైంసాను దత్తత తీసుకుంటామని పేర్కొన్నారు. సభలు పెడితే కూడా నిషేందించే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఏం నేతలు ఎక్కడైనా తిరగవచ్చు.. ధర్మంగా పోరాడే బీజేపీ నేతలకు మాత్రం ఆంక్షలతో పాటు అనుమతులుండవని ఫైర్ అయ్యారు. 

Similar News