రాజ్ భవన్ లో బతుకమ్మ వేడుకలు
రాజ్ భవన్ లో ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యా
దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్ భవన్ లో ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మలను ఒక దగ్గర చేర్చారు. గౌరమ్మకు గవర్నర్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఒక్కేసి పువ్వేసి చందమమా అంటూ పాటలు పాడారు. మహిళలతో కలిసి పాట పాడుతూ ఆడుతూ అందరిని ఉత్తేజ పరిచారు. బతుకమ్మ గొప్పతానాన్ని వివరించారు.