ఢిల్లీకి బండి సంజయ్.. సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవానికి హాజరు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ విస్టా భవనం ప్రారంభోత్సవానికి ఆయన హాజరుకానున్నారు.

Update: 2023-05-28 06:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ విస్టా భవనం ప్రారంభోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. ఖమ్మం జిల్లాలో శనివారం నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ ముగిసిన అనంతరం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న బండి సంజయ్.. ఆదివారం ఉదయమే హస్తినకు పయనమయ్యారు. ఇదిలావుండగా తెలంగాణకు చెందిన మిగిలిన ఎంపీలు ధర్మపురి అర్వింద్, సాయం బాపురావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సైతం ఢిల్లీ పయనమయ్యారు.

Tags:    

Similar News