డీహెచ్ పై మరో ఫిర్యాదు
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) రవీంద్రనాయక్పై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది.
దిశ, తెలంగాణ బ్యూరో: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) రవీంద్రనాయక్పై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. లంబాడి హక్కుల పోరాట సమితి ర్రాష్ట అధ్యక్షుడు రాజేశ్ నాయక్, జాతీయ ప్రధాన కార్యదర్శి నరేందర్ పవార్ గురువారం అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 7వ తేదీన అన్ని డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్లను రద్దు చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ,ఆ ఉత్తర్వులను పాటించకుండా డిప్యూటేషన్లు, వర్క్ ఆర్డర్ ఇస్తున్నారని ఆరోపించారు.
ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడున్నారని ఆరోపించారు. భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని వర్క్ ఆర్డర్, డిప్యూటేషన్లు ఇస్తున్నారన్నారు. పైగా అవినీతికి సహకరిస్తున్న వాళ్లను వదిలేసి కొందరు డీఎంహెచ్వోలను మాత్రమే మార్చారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వని సీనియర్లను ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారని అన్నారు. డీహెచ్ పై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి కోరింది.