కవిత విచారణ రోజే.. హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన

ఈ నెల 11 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. అయితే ముందుగా అనుకున్న తేదీల్లో మార్పులు జరిగాయి.

Update: 2023-03-09 07:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 11 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. అయితే ముందుగా అనుకున్న తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ నెల 12న అమిత్ షా కేరళ వెళ్తున్న క్రమంలో సంగారెడ్డిలో జరగాల్సిన బీజేపీ మేధావుల సమావేశం రద్దైంది. కాగా ఈ నెల 11వ తేదీన అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. తెలంగాణపై ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర నేతలను అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. 11 తేదీన ఢిల్లీలో కవిత విచారణ రోజే హైదరాబాద్‌లో బీజేపీ నేతలతో అమిషా భేటీ ప్రత్యేకతను సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి :   కవితకు ఈడీ నోటీసులు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే! 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News