అలర్ట్: ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

రోజురోజుకు సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు.

Update: 2024-04-19 05:22 GMT

దిశ, ఫీచర్స్: రోజురోజుకు సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు. రోజులో ఏకంగా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో జనాలు బయటకు పోవాలంటేనే జంకుతున్నారు. అలాగే కొందరు ఉద్యోగరీత్యా బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నారు.

కానీ ఎండవేడిని తట్టుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ ఏటైనా వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా, వాతావరణ శాఖ ఈరోజు, రేపు ఎండ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నట్లు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే వృద్ధులు, చిన్నారులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు రావొద్దని తెలిపారు.

Similar News