ఆసిఫాబాద్ వద్ద ఆర్టీసీ లగ్జరీ బస్సు బోల్తా

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది.

Update: 2023-02-06 04:38 GMT

దిశ, తాండూర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఆసిఫాబాద్ నుండి హైదరాబాద్‌కు వెళ్తోన్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు  ప్రధాన రహదారి వద్ద గల అయ్యప్ప గుడి సమీపంలో బోల్తా పడింది. ఛాతిలో నొప్పి రావడంతో డ్రైవర్ బస్సులో నుండి కిందకు దూకడంతో అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News