గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి..

గుర్తు తెలియని వాహనం ఢీకొని శుక్రవారం సిర్పూర్ మండలం చిల్లపల్లి

Update: 2024-04-26 15:36 GMT

దిశ, ఆసిఫాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని శుక్రవారం సిర్పూర్ మండలం చిల్లపల్లి గ్రామానికి చెందిన వాసాక బిక్షపతి( 29) మృతి చెందారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం బిక్షపతి అదే గ్రామానికి చెందిన గుర్లే పరశురాం లు ఇద్దరు కలిసి స్కూటీ వాహనంపై రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి వెళ్తున్న క్రమంలో ఇంద్రానగర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో బిక్షపతి పరశురాంలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బిక్షపతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Similar News